ఇరాన్లో 10 మంది పర్వాతారోహకులు మృతి
- December 27, 2020తెహ్రాన్:ఇరాన్ రాజధాని తెహ్రాన్కు ఉత్తరాన ఉన్న పర్వతాలలో సుమారు 10 మంది పర్వాతారోహకులు మృతి చెందారు. భారీ హిమపాతం కారణంగా వీరు మరణించారని స్థానిక మీడియాలో వార్తలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇరాన్లోని పలు ప్రాంతాలు భారీ హిమపాతంతో తడిసి ముద్దవుతున్నాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అనేక రహదారులను మూసివేశారు. తెహ్రాన్లోని ఆల్బోర్జ్ పర్వతాన్ని ఎక్కేందుకు వచ్చిన తొమ్మిది మంది భారీ హిమపాతంలో చిక్కుకుపోయి చనిపోగా..మరొకరిని రక్షించినప్పటికీ..చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!