మోదీ పంపిన సందేశాన్ని అందుకున్న ఎమిర్

- December 28, 2020 , by Maagulf
మోదీ పంపిన సందేశాన్ని అందుకున్న ఎమిర్

దోహా: ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, భారత ప్రధాని నరేంద్ర మోదీ పంపిన రాత పూర్వక సందేశాన్ని అందుకున్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, మరింత మెరుగైన స్నేహ పూర్వక సంబంధాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందేశాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ ద్వారా పంపారు. ఎమిర్ దివాన్ కార్యాలయంలో ఎమిర్ షేక్ తమీమ్, జైశంకర్ మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా జైశంకర్ కు ఎమిర్ ఘన స్వాగతం పలికారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com