తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..
- December 30, 2020హైదరాబాద్:తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక పక్క స్ట్రెయిన్ గుబులు పుట్టిస్తున్న తరుణంలో కరోనా కేసులు పెరగడం కూడా టెన్షన్ పెడుతోంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 474 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ముగ్గురు మృతి చెందారు.. ఇదే సమయంలో 592 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,85,939కు పెరగగా.. ఇప్పటి వరకు 1538 మంది కరోనాతో మృతి చెందారు.. 2,78,523 మంది రికవరీ అయ్యారు.. ఇక, కరోనా మరణాలు దేశంలో 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతంగా ఉన్నాయిన.. రికవరీ రేటు దేశంలో 97.40 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 96 శాతానికి పెరిగిందని బులెటిన్ లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 5,878 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 3,735 హోం ఐసోలేషన్లోనే ఉన్నారు.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,590 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... టెస్ట్ల సంఖ్య 68,39,281కు చేరినట్టు ప్రభుత్వం పేర్కొంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ