జీసీసీ సదస్సుకు ఖతార్ ఎమిర్ ను అహ్వానించిన సౌదీ రాజు
- December 30, 2020
రియాద్:గల్ఫ్ సహాకార మండలి-జీసీసీ సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరుతూ సౌదీ రాజు సల్మాన్...బహ్రెయిన్ ఎమిర్ ను అధికారికంగా అహ్వానించారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ 41వ సదస్సు జనవరి 5న సౌదీ అరేబియాలోని అల్-ఉలాలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సు జీసీసీ సభ్య దేశాల సమైక్యతను మరింత పెంపొందించే దిశగా కొనసాగుతుందని సల్మాన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. అలాగే సభ్య దేశాల మధ్య అన్ని రంగాల్లో పరస్పర సహకారం, సంయుక్త కార్యచరణతో సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొవాలని సౌదీ మంత్రివర్గ సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే..సౌదీ-బహ్రెయినీ సహాకార మండలి తొలి సమావేశంపై కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చింది. బహ్రెయిన్ తో ద్వైపాక్షిక సంబంధం మరింత బలోపేతం చేసుకోవాలని సౌదీ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!









