జీసీసీ సదస్సుకు ఖతార్ ఎమిర్ ను అహ్వానించిన సౌదీ రాజు
- December 30, 2020
రియాద్:గల్ఫ్ సహాకార మండలి-జీసీసీ సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరుతూ సౌదీ రాజు సల్మాన్...బహ్రెయిన్ ఎమిర్ ను అధికారికంగా అహ్వానించారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ 41వ సదస్సు జనవరి 5న సౌదీ అరేబియాలోని అల్-ఉలాలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సు జీసీసీ సభ్య దేశాల సమైక్యతను మరింత పెంపొందించే దిశగా కొనసాగుతుందని సల్మాన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. అలాగే సభ్య దేశాల మధ్య అన్ని రంగాల్లో పరస్పర సహకారం, సంయుక్త కార్యచరణతో సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొవాలని సౌదీ మంత్రివర్గ సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే..సౌదీ-బహ్రెయినీ సహాకార మండలి తొలి సమావేశంపై కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చింది. బహ్రెయిన్ తో ద్వైపాక్షిక సంబంధం మరింత బలోపేతం చేసుకోవాలని సౌదీ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం