జీసీసీ సదస్సుకు ఖతార్ ఎమిర్ ను అహ్వానించిన సౌదీ రాజు
- December 30, 2020
రియాద్:గల్ఫ్ సహాకార మండలి-జీసీసీ సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరుతూ సౌదీ రాజు సల్మాన్...బహ్రెయిన్ ఎమిర్ ను అధికారికంగా అహ్వానించారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ 41వ సదస్సు జనవరి 5న సౌదీ అరేబియాలోని అల్-ఉలాలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సు జీసీసీ సభ్య దేశాల సమైక్యతను మరింత పెంపొందించే దిశగా కొనసాగుతుందని సల్మాన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. అలాగే సభ్య దేశాల మధ్య అన్ని రంగాల్లో పరస్పర సహకారం, సంయుక్త కార్యచరణతో సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొవాలని సౌదీ మంత్రివర్గ సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే..సౌదీ-బహ్రెయినీ సహాకార మండలి తొలి సమావేశంపై కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చింది. బహ్రెయిన్ తో ద్వైపాక్షిక సంబంధం మరింత బలోపేతం చేసుకోవాలని సౌదీ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







