జీసీసీ సదస్సుకు ఖతార్ ఎమిర్ ను అహ్వానించిన సౌదీ రాజు
- December 30, 2020
రియాద్:గల్ఫ్ సహాకార మండలి-జీసీసీ సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరుతూ సౌదీ రాజు సల్మాన్...బహ్రెయిన్ ఎమిర్ ను అధికారికంగా అహ్వానించారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ 41వ సదస్సు జనవరి 5న సౌదీ అరేబియాలోని అల్-ఉలాలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సు జీసీసీ సభ్య దేశాల సమైక్యతను మరింత పెంపొందించే దిశగా కొనసాగుతుందని సల్మాన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. అలాగే సభ్య దేశాల మధ్య అన్ని రంగాల్లో పరస్పర సహకారం, సంయుక్త కార్యచరణతో సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొవాలని సౌదీ మంత్రివర్గ సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే..సౌదీ-బహ్రెయినీ సహాకార మండలి తొలి సమావేశంపై కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చింది. బహ్రెయిన్ తో ద్వైపాక్షిక సంబంధం మరింత బలోపేతం చేసుకోవాలని సౌదీ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







