డిసెంబర్‌ 24-28 మధ్య 34 శాతం పెరిగిన రోజువారీ కరోనా కేసులు

- December 31, 2020 , by Maagulf
డిసెంబర్‌ 24-28 మధ్య 34 శాతం పెరిగిన రోజువారీ కరోనా కేసులు

బహ్రెయిన్: కరోనాపై పోరులో భాగంగా ఏర్పాటైన నేషనల్‌ మెడికల్‌ టాస్క్‌ ఫోర్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, డిసెంబర్‌ 24 నుంచి 28 మధ్య కరోనా పాజిటివ్‌ కేసుల్లో పెరుగుదల 34 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్‌ మొదట్లో ఇది కేవలం 1.5 అలాగే 2.4గానే వుంది. కాగా, రివకరీ రేటు 97.43 శాతంగా వుంది. 0.38 మరణాల శాతం నమోదయ్యింది. ఐసోలేషన్‌ ఆక్యుపెన్సీ 8.9 శాతంగా నమోదయ్యింది. మొత్తం 6,078 బెడ్స్‌ అందుబాటులో వున్నాయి. 540 బెడ్స్‌ మాత్రమే ఆక్యుపై అయి వున్నాయి. 1,474 అసింప్టమాటిక్‌ కేసులున్నాయి. డిసెంబర్‌ 1 నుంచి 28 వరకు కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ని పరిశీలిస్తే, సోర్స్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్షన్‌కి సంబంధించి 39 శాతం కేసులు కుటుంబ సంబంధితమైనవే కావడం గమనార్హం. మరోపక్క 13 రోజుల్లో 56041 మందికి కరనా వ్యాక్సిన్‌ అందించారు. ప్రస్తుతం 2014 యాక్టివ్‌ కేసులు వున్నాయి. వీటిల్లో 10 క్రిటికల్‌ కేసులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com