ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

- January 03, 2021 , by Maagulf
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

అమరావతి:ఏ.పీలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 238 కేసులు నమోదు కాగా, ఈరోజు ఆ సంఖ్య కాస్త తగ్గింది.ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 232 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,80,187  కి చేరింది.  ఇందులో 8,70,002  మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,070 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో నలుగురు మృతి చెందారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,115 కి చేరింది.  ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 352 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com