వచ్చి పోయే ప్రయాణీకులకు కొత్త నిబంధనలు
- January 05, 2021
కువైట్ సిటీ:కరోనా వైరస్ న్యూ స్ట్రెయిన్ ఆందోళనల నేపథ్యంలో డిసెంబర్ 21 నుంచి నిలిచిపోయిన రాకపోకల్ని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జనవరి 2 నుంచి పునఃప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో సరికొత్త నిబంధనల్ని వచ్చి పోయే ప్రయాణీకుల కోసం రూపొందించి, అమల్లోకి తెస్తున్నారు. డిజిసిఎ విడుదల చేసిన కొత్త ప్రకటనను బట్టి, విమానాశ్రయంలో ప్రయాణీకులందరికీ పిసిఆర్ టెస్ట్ తప్పనిసరిగా చేస్తారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళుతున్నవారంతా కువైట్ మోసాఫెర్(MOSAFER) యాప్లో తమ వివరాల్ని రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. కువైటీ ప్రయాణీకులు హెల్త్ ఇన్స్యూరెన్స్ పొందడంతోపాటు, కువైట్ మోసాఫిర్ ద్వారా ప్రతిజ్న కూడా చేయాల్సి వుంటుంది. నకువైటీలకు, వారి ఫస్ట్ డిగ్రీ బంధువులకు, డొమెస్టిక్ వర్కర్స్కు కూడా కువైట్ ఎయిర్వేస్ కార్పరేషన్, రిజర్వేషన్ సౌకర్యం (విదేశాల్లో చిక్కుకుపోయినవారికి) కల్పిస్తోంది. అయితే, కరోనా హైరిస్క్ కేటగిరీలో పొందుపర్చబడ్డ 35 దేశాల నుంచి డైరెక్ట్ ఎంట్రీ పై మాత్రం బ్యాన్ కొనసాగుతుందని మినిస్ట్రీ వివరించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









