ప్రముఖ లిరిసిస్ట్ వెన్నెలకంటి కన్నుమూత..
- January 05, 2021టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ లిరిసిస్ట్ వెన్నెలకంటి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్తో కాసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. 1988లో మురళీ కృష్ణుడు మూవీ ద్వారా వెన్నెలకంటి లిరిసిస్ట్గా పరిచయం అయ్యారు. ఆ తరువాత ఆదిత్య 369, ఘరానా అల్లుడు, ఘరానా బుల్లోడు, క్రిమినల్, సమరసింహారెడ్డి, టక్కరి దొంగ, వస్తాడు నా రాజు, చెప్పాలని ఉంది ఇలా పలు హిట్ సినిమాలకు ఆయన సాహిత్యం అందించారు. ఇక తెలుగులో డబ్బింగ్ అయిన పలు తమిళ చిత్రాలకు ఆయన డైలాగ్ రైటర్గా పనిచేశారు. చివరగా గతేడాది పెంగ్విన్ చిత్రానికి ఆయన లిరిక్ రైటర్గా పనిచేశారు. కాగా ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్దకుమార్ శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ సినిమాలకు రైటర్గా పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు రాకేందు మౌళి నటుడిగా, రిలిక్స్ రైటర్గా, సింగర్గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..