భారత్ లో పెరుగుతున్న కొత్త స్ట్రైన్ కేసులు...

- January 05, 2021 , by Maagulf
భారత్ లో పెరుగుతున్న కొత్త స్ట్రైన్ కేసులు...

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది.ఇది మంచి విషయమే.అదే సమయంలో యుకె నుంచి వచ్చిన కొత్త స్ట్రైన్ కేసులు పెరుగుతుండటం కొంత ఇబ్బంది కలిగిస్తోంది.యుకె నుంచి వచ్చిన ప్రయాణికులను ట్రేస్ చేసి టెస్టులు చేస్తున్నారు.కొత్త స్ట్రైన్ కేసులు బయటపడిన వ్యక్తులను సింగిల్ గా ఐసోలేషన్ చేస్తున్నారు.పాత కరోనా వైరస్ కంటే కూడా కొత్త స్ట్రైన్ వైరస్ 70శాతం వేగంగా విస్తరిస్తోంది.మంగళవారం ఉదయం వరకు కొత్త స్ట్రైన్ కేసులు 58 ఉండగా, సాయంత్రానికి ఆ సంఖ్య 71కి చేరింది.ఉదయం నుంచి సాయంత్రం వరకు 13 కొత్త స్ట్రైన్ కేసులు బయటపడ్డాయి.కేసులు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com