తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- January 06, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో కొత్తగా 417 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,410కు పెరిగింది.. ఇక, 472 మంది తాజాగా కోలుకోవడంతో.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,81,872కు చేరింది.. మరో ఇద్దరు మృతిచెందగా.. 1556కు పెరిగింది మృతుల సంఖ్య.. కరోనా మృతుల సంఖ్య దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి తగ్గినట్టు, కరోనా రికవరీ రేటు భారత్లో 96.3 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 97.73 శాతానికి పెరిగినట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. ఇక, రాష్ట్రంలో ప్రస్తుతం 4,982 యాక్టివ్ కేసులు ఉండగా... వీరిలో 2,748 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. మరోవైపు.. మంగళవారం రాష్ట్రంలో 43,318 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్టు.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్ల సంఖ్య 71,04,367కు పెరిగినట్టు కరోనా బులెటిన్లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష