ఏ.పీ రాష్ట్ర సరిహద్దులో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో దాడులు

- January 09, 2021 , by Maagulf
ఏ.పీ రాష్ట్ర సరిహద్దులో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో దాడులు

ఏ.పీ: ఏ.పీ రాష్ట్ర సరిహద్దులోని ఐదు గ్రామాలలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) దాడులు భారీగా నాటు సారా ద్వంసం చేశారు.స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ IPS  ఆదేశాల మేరకు విజయనగరం సెబ్‌ , ఒడిశా రాష్ట్రాల పోలీసులు రాష్ట్ర  సరిహద్దుల్లోని యెదుగుబాల్సా, ఆలమండ, కప్పలడ, బిత్తరపాడ, జయకోట జిల్లాలలో ముమ్మరంగా నాటు సారా తయారీ కేంద్రాలపైన దాడులు నిర్వహించడం జరిగింది.

ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నాటు సారా నాటు సారాను ద్వంసం చేయడం ధ్వంసం చేయడం జరిగింది. సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ ఎన్. శ్రీదేవి రావు పర్యవేక్షణలో ఇసుక అక్రమ రవాణా, మద్యం, నాటు సారా కట్టడికి జిల్లాలో సెబ్‌ టీం, పోలీసు, ఎక్సైజ్‌ పోలీసులు, ఒరిస్సా పోలీసుల సమన్వయంతో దాడులను నిర్వహించారు. 52,100 లీటర్ల నాటు సారా ఊటను ధ్వంసం చేయడం తోపాటు 150 కిలోల నల్ల బెల్లం ను స్వాదీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com