జపాన్ లో విజృంభిస్తున్న కరోనా...ప్రస్నార్ధకంగా ఒలింపిక్స్
- January 11, 2021
టోక్యో: కరోనా వైరస్ కొత్త రూపం జపాన్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే కేసులు భారీగా నమోదవుతుండడంతో ఆ దేశ రాజధాని టోక్యోలో అత్యవసర పరిస్థితి విధించారు. ప్రస్తుతం తీవ్ర ఆంక్షలు ఆ దేశంలో అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం కొత్త వర్షన్ వెలుగులోకి రావడంతో విదేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. చాలా దేశాలకు విమాన సేవలను నిలిపివేశారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో టోక్యోలో జరగాల్సిన ఒలంపిక్స్ రద్దయ్యే అవకాశం ఉంది. లేదా కొన్నాళ్లు వాయిదా వేసేలా ఉందని ఆ దేశంలో చేసిన సర్వే తెలుపుతోంది.
దాదాపు 80 శాతం మంది టోక్యో ఒలింపిక్స్ రద్దు చేయాలని ఆ దేశానికి చెందిన ఓ మీడియా సంస్థ చేసిన సర్వేలో తేలింది. 35.3శాతం మంది వాయిదా వేయాలని చెప్పారు. వాస్తవానికి 2020 జూలైలో జరగాల్సి ఉండగా 2021కి వాయిదా వేశారు. 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఒలంపిక్స్ రీ షెడ్యూల్ చేశారు. అయితే ఇప్పుడు కూడా ఈ క్రీడా సంబరాలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు.
జపాన్లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. 2లక్షల 80 వేలకు పైగా కేసులు నమోదవగా.. 4 వేల మంది మృత్యువాత పడ్డారు. ఇంత పెద్దమొత్తంలో కేసులు నమోదవడంతో ఆ దేశంలో తీవ్ర ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఒలంపిక్స్ నిర్వహణపై సందిగ్ధం ఏర్పడింది. సర్వే చేయగా ఒలంపిక్స్ రద్దుకు ఎక్కువ మంది మొగ్గు చూపగా.. వాయిదా వేయాలని కొంతమంది చెప్పారు. ఏది ఏమైనా ఈ ఏడాది కూడా ఒలింపిక్స్ జరిగే అవకాశం కనిపించడం లేదు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష