అయ్యప్ప భక్తులకు శుభవార్త..త్వరలో శబరిమలకు డైరెక్ట్ రైలు.. !
- January 11, 2021
తిరువనంతపురం: శబరిమలకు నేరుగా చేరుకోవలంటే ఏ రైలులో వెళ్లాలి..? అంటే కచ్చితంగా సరైన సమాధానం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు శబరిమలకు డైరెక్టుగా రైలు మార్గమే లేదు. శబరిమల వెళ్లాలనుకునేవారు కొట్టాయం, తిరువల్ల, చెంగనూర్ వరకు రైలులో వెళ్లి అక్కడి నుంచి బస్సులు, కార్లలో పంబకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం దాదాపు 90 కిలోమీటర్లు ఉంటుంది. పంబకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి కాలినడకన శబరిమలకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఎట్టకేలకు శబరిమలకు నేరుగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు కేరళ ప్రభుత్వం ఓకే చెప్పింది. ప్రాజెక్టలో తాము 50 శాతం ఖర్చు భరిస్తామని అందులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో దశాబ్దాలుగా భక్తులు ఎదురు చూస్తున్న రైలు మార్గం కల సాకారమైంది.
ఎప్పుడో 1998లో ఎర్నాకులంలోని అంగమలై నుంచి కొట్టాయం లోని ఎరుమేలి వరకు 111 కిలోమీటర్ల రైలు మార్గం ఏర్పాటుకు సంబంధించి కేంద్రం ప్రతిపాదించింది. ఇది శబరిమలకు దాదాపు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శబరిమలతో పాటు అనేక ఆలయాలను కలుపుతూ ఈ రైల్వేలైను వెళుతుంది. అయితే ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు విషయంలో కేంద్రానికి, అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొంది. దీంతో దాదాపు రెండు దశాబ్దాల నుంచి ప్రాజెక్టు వాయిదా పడుతూనే వస్తోంది. అయితే ఎట్టకేలకు ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర షరతులకు తలూపింది. రైలు మార్గానికయ్యే ఖర్చులో 50 శాతం భరిచేందుకు ఒప్పుకుంది. దీంతో దశాబ్దాల నాటి భక్తుల కల నెరవేరినట్లేది.
తాజా వార్తలు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!









