భారత్:ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ ఉచితం
- January 11, 2021
న్యూఢిల్లీ:జనవరి 16 నుండి ప్రారంభమయ్యే సామూహిక వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రులను ప్రధాని మోడీ కోరారు. కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ముఖ్యమంత్రులతో చర్చించారు. మొత్తంగా 30 కోట్ల మందికి కేంద్రం వ్యాక్సిన్ అందించనుంది. తొలి ప్రాధాన్యతగా కరోనా సమయంలో ముందుండి సేవలందించిన 3 కోట్ల మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాక్సిన్ను అందిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వైద్యారోగ్య సిబ్బందికి అందించే వ్యాక్సిన్కు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అదేవిధంగా 50 ఏళ్లకు పైబడిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. జులై నాటికి మిగిలిన 27 కోట్ల మంది ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకుంది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న 3 కోట్ల మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాక్సిన్ అందించాలని అనుకుంటున్నామని, కానీ ఈ ఖర్చును రాష్ట్రాలు భరించనవసరం లేదని, కేంద్రమే భరిస్తుందని...ముఖ్యమంత్రులకు మోడీ భరోసా నిచ్చారు. భారత్లో మాత్రమే వ్యాక్సిన్ తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తుందని, ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రొటోకాల్ను అనుసరించాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







