ఏపీలో కరోనా కేసుల వివరాలు

- January 11, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏ.పీ‌లో గడిచిన 24 గంటల్లో 30,933 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 121 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,82,142కి చేరింది. కరోనా మహమ్మారి సోకి తాజాగా మరొకరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 7,130కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 289 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,72,561కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,450 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,23,55,607 శాంపిల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.

 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com