యూఏఈలో ముమ్మరంగా వ్యాక్సినేషన్..12 లక్షల మందికిపైగా లబ్ధిదారులు
- January 13, 2021
యూఏఈ:కోవిడ్ అరికట్టడంలో ముందు నుంచి పటిష్ట చర్యలు తీసుకుంటున్న యూఏఈ...కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలోనూ అదే స్థాయిలో చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సిన్ కు అనుమతులు రాగానే యుద్ధప్రతిపాదికన వ్యాక్సినేషన్ కార్యాక్రమాన్ని కింగ్డమ్ వ్యాప్తంగా ప్రారంభించింది. ఇప్పటివరకు 12,75,000 మందికి వ్యాక్సిన్ అందించినట్లు యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మొహముద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వెల్లడించారు. వ్యాక్సినేషన్ ను విజయవంతంగా నిర్వహించటంలో నిర్విరామంగా కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లను ప్రధాని ప్రశంసించారు. సమర్ధవంతంగా, వేగంగా, ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించటంలో యూఏఈ ప్రపంచంలో రెండో దేశంగా నిలిచిందని..ఇదంతా ఫ్రంట్ లైన్ వర్కర్లు, సహాయక సిబ్బంది సాధించిన ఘనత అని ఆయన కొనియాడారు. కింగ్డమ్ పరిధిలోని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత ఉంటుందనే విషయాన్ని గుర్తు ఉంచుకోవాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల సమాజ భద్రతకు తమ వంతు పాత్రను పోషించాలని, కోవిడ్ ముప్పు నుంచి బయట పడటం ద్వారా మన లక్ష్యాలు, ఆర్ధిక సమస్యలను అధిగమించే దిశగా ప్రయాణిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







