కువైట్:క్లాసులు ఉంటాయ్..పరీక్షలు ఉండవ్
- January 13, 2021
కువైట్ సిటీ:ఈ విద్యాసంవత్సరంలో పరీక్షలపై కువైట్ విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో తొలి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించటం లేదని ప్రకటించారు. అయితే..అన్ని క్లాసుల వారికి ఆన్ లైన్ లో క్లాసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని కూడా వెల్లడించారు. పరీక్షల నిర్వహణపై విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు.. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించటం అంతగా శ్రేయస్కరం కాదనే భావనకు వచ్చినట్లు విద్యాశాఖ కార్యదర్శి వివరించారు. పరీక్షల నిర్వహణపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే..పేపర్ విధానంలో పరీక్షల నిర్వహణ విద్యార్ధులు, పాఠాశాల సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రమాదమని, అదే సమయంలో ఆన్ లైన్ లో కూడా పరీక్ష నిర్వహణపై అధికారుల బృందం నుంచి విముఖత వ్యక్తం అయిందని ఆయన తెలిపారు. అందుకే ఈ విద్యా సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించటం లేదని తెలిపారు.
తాజా వార్తలు
- ఇక వాట్సాప్లోనే తిరుమల దర్శనం టికెట్లు..బుకింగ్ ప్రాసెస్ ఇదే!
- నేటి నుంచి టీ20 ప్రపంచకప్
- చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్..కేంద్రం కీలక నిర్ణయం?
- దుబాయ్ లో స్కూటర్, కారును ఢీ..!!
- USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!
- కువైట్-యూఏఈ సంబంధాలపై అమీర్ ప్రశంసలు..!!
- సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్
- ఇటలీ ప్రధానమంత్రితో అమీర్ ద్వైపాక్షిక సంబంధాలు..!!
- రమదాన్ స్పెషల్..మదీనాకు షటిల్ బస్సులు..!!
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం









