కువైట్:క్లాసులు ఉంటాయ్..పరీక్షలు ఉండవ్
- January 13, 2021
కువైట్ సిటీ:ఈ విద్యాసంవత్సరంలో పరీక్షలపై కువైట్ విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో తొలి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించటం లేదని ప్రకటించారు. అయితే..అన్ని క్లాసుల వారికి ఆన్ లైన్ లో క్లాసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని కూడా వెల్లడించారు. పరీక్షల నిర్వహణపై విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు.. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించటం అంతగా శ్రేయస్కరం కాదనే భావనకు వచ్చినట్లు విద్యాశాఖ కార్యదర్శి వివరించారు. పరీక్షల నిర్వహణపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే..పేపర్ విధానంలో పరీక్షల నిర్వహణ విద్యార్ధులు, పాఠాశాల సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రమాదమని, అదే సమయంలో ఆన్ లైన్ లో కూడా పరీక్ష నిర్వహణపై అధికారుల బృందం నుంచి విముఖత వ్యక్తం అయిందని ఆయన తెలిపారు. అందుకే ఈ విద్యా సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించటం లేదని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







