సీరం తరువాత ఇక భారత్ బయో టెక్, దేశంలోని వివిధ నగరాలకు తరలిన కొవాగ్జిన్ వ్యాక్సిన్
- January 13, 2021
భారత్ బయో టెక్ సంస్థ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ బుధవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి రవాణా అయింది. ఢిల్లీతో బాటు దేశంలోని సుమారు 10 నగరాలకు ఈ వ్యాక్సిన్ ని తరలించారు. మొదట ఎయిరిండియా విమానంలో ఢిల్లీకి కొవాగ్జిన్ బాక్సులు వెళ్లగా ఆ తరువాత వివిధ ట్రక్కుల్లో ఆయా నగరాలకు రవాణా చేశారు. 80.5 కేజీల బరువైన మూడు బాక్సులను తొలి కన్ సైన్ మెంట్ లో ఢిల్లీ నగరానికి తరలించినట్టు భారత్ బయో టెక్ కంపెనీ వర్గాలు తెలిపాయి. బెంగుళూరు, పాట్నా, జైపూర్, లక్నో తదితర సిటీలకు ఈ వ్యాక్సిన్ వెళ్ళింది .55 లక్షల కొవాగ్జిన్ డోసులు, సీరం వారి 1.1 కోట్ల కొవిషీల్డ్ డోసులను తాము ప్రొక్యూర్ చేసినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు వ్యాక్సిన్లను అత్యవసర వినియోగం కోసం భారత రెగ్యులేటరీ అనుమతించింది. భారత్ బయో టెక్ సంస్థ డోసుకు 295 రూపాయలు వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 38.5 లక్షల డోసుల్లో ఈ సంస్థ కేంద్రానికి ఉచితంగా 16.5 లక్షల డోసులను అందజేయనుంది.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







