ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

- January 13, 2021 , by Maagulf
ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏ.పీలో కరోనా కేసులు కాస్త తగ్గు ముఖం పట్టాయి.ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 203 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  8,82,542   కి చేరింది.ఇందులో 8,73,026   మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా,  2,382 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక్కరు మాత్రం మరణించారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,134 కి చేరింది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 231 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com