కువైట్:ఎంబసీ పేరుతో ఫేక్ కాల్స్..భారతీయులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
- January 14, 2021
కువైట్ సిటీ:ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న ఆర్ధిక మోసాలపై కువైట్ లోని ఎంబసీ అధికార కార్యాలయం..ఇండియన్ కమ్యూనిటీ అప్రమత్తం చేసింది. కొందరు నేరగాళ్లు ఎంబసీ అధికారులమని చెప్పి కువైట్లోని భారతీయులను నమ్మిస్తున్నారని, ఆ తర్వాత వివరాల అప్ డేట్ ఫీజులు, ఇతర కారణాలు చెప్పి డబ్బు పింపించాలని అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు వివరించారు. ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు ప్రధానంగా భారతీయ సమాజాన్నే లక్ష్యంగా చేసుకుందని హెచ్చరించారు. ఎంబసీ కార్యాలయ అధికారులు అనవసరంగా ఫోన్ చేయరనే విషయాన్ని కువైట్ లోని భారతీయులు గమనించాలని కోరారు. అంతేకాదు..ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగతంగా ఫోన్ చేసి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలని అడిగరని గుర్తుంచుకోవాలన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డు వివరాలను కూడా ఎంబసీ అడగబోదని తెలిపారు. అందువల్ల ఎంబసీ పేరుతో ఎవరైనా ఫోన్ చేసి నగదు బదిలీ చేయాలని కోరినా, బ్యాంకు, క్రెడిట్ కార్డు వివరాలను
అడిగినా ఇవ్వొద్దని సూచించారు. అంతేకాదు..ఎంబసీ అందిస్తున్న సేవల పట్ల అవగాహన లేకుంటే http://www.indembkwt.gov.in/వెబ్ సైట్ ద్వారా వివరాలు తెల్సుకోవచ్చని వెల్లడించింది. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు కోరినా, బ్యాంకు ఖతా, క్రెడిట్ కార్డు వివరాలు అడిగినా వెంటనే [email protected] కి ఫిర్యాదు చేయాలన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ
- ఈ నెల 18న బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ







