కారు టైర్ బాగా లేకున్నా ఫైన్, బ్లాక్ పాయింట్స్..వాహనదారులకు యూఏఈ వార్నింగ్
- January 14, 2021
యూఏఈ ట్రాఫిక్ పోలీసులు వాహన నిబంధనల్లో కొత్త షరతులను అమల్లోకి తీసుకొచ్చారు. ఇక నుంచి టైర్లు పాడైపోయిన కారులో ప్రయాణించినా ఫైన్ తో పాటు బ్లాక్ పాయింట్లు వేస్తామని అబుధాబిలోని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. పాడైపోయి, పగుళ్లు పట్టిన టైర్లు ప్రమాదానికి కారణమవుతున్నాయని, ప్రయాణంలో ఉన్నప్పుడు టైర్లు పేలిపోవటం ద్వారా యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నది పోలీసుల వాదన. అందుకే పాతబడిన టైర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని వివరించారు. ఇక నుంచి ఎవరైనా పాతబడిన టైర్లను మార్చుకోకుండా కార్లను రోడ్ల మీదకు తీసుకొస్తే Dh500 జరిమానా, 4 బ్లాక్ పాయింట్లు విధిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా లాంగ్ జర్నీకి వెళ్లే వారు టైర్ల కండీషన్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







