వ్యాక్సిన్ తీసుకున్నా క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసిన కువైట్
- January 15, 2021
కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నా క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉండదని కువైట్ ప్రకటించింది. విదేశాల నుంచి కువైట్ వచ్చే వారు...విదేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ చూపించినా..దాన్ని తాము పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చే వారిలో కొందరు వ్యాక్సిన్ తీసుకున్నట్లు నకిలీ సర్టిఫికెట్లు తీసుకొస్తున్నారని, అందుకే క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ ల నుంచి మినహాయింపు ఇవ్వటం లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే..కువైట్ లో నే వ్యాక్సిన్ తీసుకొని వేరే దేశాలకు వెళ్లి..మళ్లీ తిరిగి వచ్చే వారికి మాత్రం క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందని కూడా వెల్లడించింది. అయితే..దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కూడా కువైట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







