భారత్ లో కరోనా కేసుల వివరాలు
- January 16, 2021న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా కేసులు ఓరోజు పెరుగుతూ.. మరోరోజు తగ్గుతూ వస్తున్నాయి.. గత బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 15,600 వరకు కేసులు నమోదు కాగా.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 15,158 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 175 మంది కరోనాతో మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 16,977 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,42,841కు పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 1,01,79715కు చేరింది.. ఇక, ఇప్పటి వరకు కరోనావైరస్ బారినపడి 1,52,093 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 2,11,033 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్రం తన బులెటిన్లో పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- వరంగల్ విమానాశ్రయం పై కదలిక