భారత్ లో కరోనా కేసుల వివరాలు

- January 16, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా కేసులు ఓరోజు పెరుగుతూ.. మరోరోజు తగ్గుతూ వస్తున్నాయి.. గత బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా 15,600 వరకు కేసులు నమోదు కాగా.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 15,158 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 175 మంది కరోనాతో మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 16,977 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,42,841కు పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 1,01,79715కు చేరింది.. ఇక, ఇప్పటి వరకు కరోనావైరస్‌ బారినపడి 1,52,093 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 2,11,033 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు కేంద్రం తన బులెటిన్‌లో పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com