మస్కట్: ఇన్వెస్ట్మెంట్స్, రెసిడెన్సీ రెన్యూవల్ కోసం 1000 దరఖాస్తులు
- January 16, 2021
మస్కట్:విదేశీ పెట్టుబడుదారుల తమ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఇన్వెస్ట్ మెంట్స్, రెసిడెన్సీ రెన్యూవల్ కోసం దాదాపు 1000 అప్లికేషన్లు వచ్చినట్లు పరిశ్రమలు, వాణిజ్య, పెట్టుబడుల ప్రొత్సహాక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే..కోవిడ్ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్ మెంట్, రెసిడెన్సీ రెన్యూవల్ కోసం ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. సాధారణంగా రెన్యూవల్ కోసం విదేశీ పెట్టుబడుదారులు దరఖాస్తు చేసుకున్న తర్వాత...పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు, పోలీసులు, కార్మిక శాఖ అధికారులు సంయుక్తంగా ఆయా యూనిట్లను నేరుగా పరిశీలించి ఆ తర్వాత రెన్యూవల్ ప్రక్రియకు ఆమోదం తెలుపుతారు. అయితే...ప్రస్తుతం కోవిడ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారుల బృందం క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఉండదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకుంటే ఫీల్డ్ విజిట్ లేకుండానే ఇన్వెస్టర్ కార్డులను జారీ చేస్తామని వెల్లడించింది.
తాజా వార్తలు
- UTS యాప్ సేవలు బంద్..
- మలేషియాకు బయలుదేరిన ప్రధాని మోదీ
- ఇక వాట్సాప్లోనే తిరుమల దర్శనం టికెట్లు..బుకింగ్ ప్రాసెస్ ఇదే!
- నేటి నుంచి టీ20 ప్రపంచకప్
- చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్..కేంద్రం కీలక నిర్ణయం?
- దుబాయ్ లో స్కూటర్, కారును ఢీ..!!
- USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!
- కువైట్-యూఏఈ సంబంధాలపై అమీర్ ప్రశంసలు..!!
- సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్
- ఇటలీ ప్రధానమంత్రితో అమీర్ ద్వైపాక్షిక సంబంధాలు..!!









