సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- January 17, 2021
న్యూఢిల్లీ: కొవిడ్-19 విజృంభణ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. బ్రిటన్లో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్ ఇప్పటికే 50దేశాలకు వ్యాప్తి చెందినట్టు ఓ ప్రకటనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సింగపూర్ చేరుకోగానే తప్పనిసరిగా కొవిడ్-19 నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జనవరి 25 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. కాగా.. ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్ టెస్ట్ చేయించుకుని ఉండి, నెగెటివ్ సర్టిఫికేట్ పొందిన వారిని మాత్రమే సింగపూర్ ప్రభుత్వం ఇప్పటి వరకు తమ దేశంలోకి అనుమతిస్తూ వచ్చింది. అంతేకాకుండా ఈ నిబంధనను విదేశీ పౌరులకు, కొవిడ్ తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో పర్యటించినట్టు ట్రావెల్ హిస్టరీ ఉన్న వారికే పరిమితం చేసింది. అయితే ఈనెల 25 నుంచి అమలులోకి రాబోతున్న ఆదేశాలు మాత్రం విదేశీ పౌరులతోపాటు స్వదేశీయులకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









