ఏపీలో కరోనా కేసుల వివరాలు

- January 17, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,985కు చేరింది. తాజాగా కరోనాతో రాష్ట్రంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 7,140కి పెరిగింది. అటు గత 24 గంటల్లో కొత్తగా 251 మంది కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,896 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 36,091 టెస్టులు చేయగా.. ఇప్పటివరకు మొత్తం 1,25,76,272 టెస్టులు చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

-ఆర్.వి.ఆర్. ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com