కారు ప్రమాదం: భర్త డ్రైవింగ్.. భార్య మృతి
- January 18, 2021
యూఏఈ: యూఏఈ లోని అజ్మాన్లో ఓ వ్యక్తి కారు పార్కింగ్ చేస్తున్న క్రమంలో అనుకోకుండా వాహనం భార్య మీదకు దూసుకెళ్లడంతో మహిళ మరణించింది.వివరాల్లోకి వెళ్తే..కేరళకు చెందిన లిజీ(45) తన భర్తతో కలిసి శనివారం హెల్త్ చెకప్ కోసం తమ కమ్యూనిటీలోని ఆసుపత్రికి వెళ్లారు.అజ్మాన్ లోని ఆసుపత్రి వద్దకు వచ్చాక లిజీ కారు ఎదుట నిల్చోని వాహనాన్ని పార్కింగ్ చేస్తున్న తన భర్తకు డైరెక్షన్స్ చెబుతోంది.ఈ క్రమంలో అనుకోకుండా కారు వేగంగా ముందుకు దూసుకు రావడంతో లిజీని ఢికొని సరిహద్దు గోడకు తాకింది.
ఈ ప్రమాదంలో మహిళకు గాయాలవ్వగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.పదేళ్ల క్రితమే ఈ జంట యూఏఈలో స్థిరపడ్డారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఇండియాలో ఇంజనీరింగ్ చేస్తుండగా కూతురు దుబాయ్లో చదువుతోంది. కాగా ఈ విషయం తెలియగానే యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ షాక్కు గురైనట్లు ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సజద్ నిట్టికా తెలిపారు.ఈ ఘటనపై అజ్మాన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి ఇండియన్ అసోసియేషన్ కుటుంబానికి సహకరిస్తోందన్నారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







