యూఏఈ చేరుకున్న భారత మంత్రి మురళీధరన్
- January 19, 2021భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ సోమవారం అబుదాబీ చేరుకున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా అబుదాబీ చేరుకున్న మురళీధరన్కి యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ ఘన స్వాగతం పలికారు. భారత వలస కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఇండియన్ గ్రూప్స్తో సమావేశం కానున్నారు మంత్రి మురళీధరన్. మూడు రోజుల యూఏఈ పర్యటనలో మురళీధరన్, యూఏఈకి చెందిన పలువురు ప్రముఖులతో, అధికారులతో భేటీ కానున్నారు. 2019 అక్టోబర్లో చివరిసారిగా మురళీధరన్ యూఏఈలో పర్యటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ - యూఏఈ సంయుక్తంగా పనిచేశాయి. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాలకు ఎంతో ఉపయోగకరమని ఇరు దేశాల ప్రముఖులు పలు సందర్భాల్లో అభిప్రాయ పడ్డారు. 2020 నవంబర్లో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ యూఏఈలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ జరిగింది.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం