యూఏఈ చేరుకున్న భారత మంత్రి మురళీధరన్
- January 19, 2021భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ సోమవారం అబుదాబీ చేరుకున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా అబుదాబీ చేరుకున్న మురళీధరన్కి యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ ఘన స్వాగతం పలికారు. భారత వలస కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఇండియన్ గ్రూప్స్తో సమావేశం కానున్నారు మంత్రి మురళీధరన్. మూడు రోజుల యూఏఈ పర్యటనలో మురళీధరన్, యూఏఈకి చెందిన పలువురు ప్రముఖులతో, అధికారులతో భేటీ కానున్నారు. 2019 అక్టోబర్లో చివరిసారిగా మురళీధరన్ యూఏఈలో పర్యటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ - యూఏఈ సంయుక్తంగా పనిచేశాయి. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాలకు ఎంతో ఉపయోగకరమని ఇరు దేశాల ప్రముఖులు పలు సందర్భాల్లో అభిప్రాయ పడ్డారు. 2020 నవంబర్లో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ యూఏఈలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ జరిగింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు