సౌదీలో జాబ్ చేయాలనుకునే విదేశీ ఇంజనీర్లకు ప్రొఫెషనల్ టెస్ట్ తప్పనిసరి
- January 19, 2021రియాద్:సౌదీ అరేబియాలో జాబ్ చేయాలనుకునే విదేశీ ఇంజనీర్లకు నిబంధనలను కఠినతరం చేసింది స్థానిక ప్రభుత్వం. ఇక నుంచి ప్రొఫెషనల్ టెస్ట్ నిర్ణయించిన తర్వాత కింగ్డమ్ లో జాబ్ వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు..అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వివరాలను, ప్రాక్టికల్ ఎక్స్ పీరిన్స్ ను కూడా పరిగణలోకి తీసుకోనుంది. విద్య, వృత్తి నైపుణ్య శిక్షణ శాఖ ఉన్నతాధికారులు, సౌదీ ఇంజనీర్ల మండలి అధికారులు సౌదీయేతర ఇంజనీర్ల ఉద్యోగాలకు సంబంధించి సమీక్షించారు. కింగ్డమ్ లో ఇంజనీర్లుగా జాబ్ చేసేందుకు ప్రతిభావంతులను మాత్రమే ఎంపిక చేసేలా ఈ కొత్త విధానాలను అమలులోకి తీసుకొచ్చినట్లు అధికారుల ప్రకటించారు. సోసైటి భద్రతకు తమకు అత్యంత ముఖ్యమని ఈ విషయంలో రాజీ ప్రస్తావన ఉండబోదని వెల్లడించారు. ప్రొఫెషనల్ టెస్ట్ క్లియర్ చేసిన వారికే సౌదీ వచ్చేందుకు జాబ్ వీసా మంజూరు చేస్తారని వివరించారు. పీయర్సన్ వీయూఈ భాగస్వామ్యంతో సౌదీ రావాలనుకునే ఇంజనీర్లకు వారి సొంత దేశాల్లోనే పరీక్షలు నిర్వహించనున్నారు. అత్యున్నత ప్రమాణాలతో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి టెస్ట్ క్లియర్ అయిన వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు