సౌదీలో జాబ్ చేయాలనుకునే విదేశీ ఇంజనీర్లకు ప్రొఫెషనల్ టెస్ట్ తప్పనిసరి
- January 19, 2021రియాద్:సౌదీ అరేబియాలో జాబ్ చేయాలనుకునే విదేశీ ఇంజనీర్లకు నిబంధనలను కఠినతరం చేసింది స్థానిక ప్రభుత్వం. ఇక నుంచి ప్రొఫెషనల్ టెస్ట్ నిర్ణయించిన తర్వాత కింగ్డమ్ లో జాబ్ వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు..అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వివరాలను, ప్రాక్టికల్ ఎక్స్ పీరిన్స్ ను కూడా పరిగణలోకి తీసుకోనుంది. విద్య, వృత్తి నైపుణ్య శిక్షణ శాఖ ఉన్నతాధికారులు, సౌదీ ఇంజనీర్ల మండలి అధికారులు సౌదీయేతర ఇంజనీర్ల ఉద్యోగాలకు సంబంధించి సమీక్షించారు. కింగ్డమ్ లో ఇంజనీర్లుగా జాబ్ చేసేందుకు ప్రతిభావంతులను మాత్రమే ఎంపిక చేసేలా ఈ కొత్త విధానాలను అమలులోకి తీసుకొచ్చినట్లు అధికారుల ప్రకటించారు. సోసైటి భద్రతకు తమకు అత్యంత ముఖ్యమని ఈ విషయంలో రాజీ ప్రస్తావన ఉండబోదని వెల్లడించారు. ప్రొఫెషనల్ టెస్ట్ క్లియర్ చేసిన వారికే సౌదీ వచ్చేందుకు జాబ్ వీసా మంజూరు చేస్తారని వివరించారు. పీయర్సన్ వీయూఈ భాగస్వామ్యంతో సౌదీ రావాలనుకునే ఇంజనీర్లకు వారి సొంత దేశాల్లోనే పరీక్షలు నిర్వహించనున్నారు. అత్యున్నత ప్రమాణాలతో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి టెస్ట్ క్లియర్ అయిన వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు