300దిర్హాములకే ఇండియా టూ యూఏఈ ఫ్లైట్ టికెట్...ఎయిర్ అరేబియా ఆఫర్

- January 21, 2021 , by Maagulf
300దిర్హాములకే  ఇండియా టూ యూఏఈ ఫ్లైట్ టికెట్...ఎయిర్ అరేబియా ఆఫర్

యూఏఈ:ఇండియా నుంచి యూఏఈ ప్రయాణించే ప్రయాణికుల కోసం ఎయిర్ అరేబియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 300దిర్హాములకు టికెట్లను బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ ధర కేవలం ఇండియా నుంచి యూఏఈ వెళ్లే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. కోవిడ్ 19 సంక్షోభం తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న దేశీయ పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. చౌక ధరలో పర్యాటకుల్ని ఆకర్షించేలా ఆఫర్లను ప్రకటిస్తోంది. గతంలో కూడా షార్జా నుంచి ఇతర దేశాలకు తమ విమాన సంస్థల్లో ప్రకటించే వారికి ఎయిర్ అరేబియా కోవిడ్ 19 ఇన్సూరెన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. షార్జా నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు...తమ ప్రయాణం తర్వాత 31 రోజుల్లోపు కోవిడ్ బారిన పడితే మెడిసిన్, క్వారంటైన్ ఖర్చులు ఎయిర్ అరేబియా అందించే ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com