దుబాయ్ రెస్టారెంట్లు, కేఫ్ లలో సోషల్ డిస్టెన్సింగ్ అమలుకు కొత్త రూల్స్
- January 23, 2021దుబాయ్:రెస్టారెంట్లు, కేఫ్ లలో అమలు చేస్తున్న భౌతిక దూరం నిబంధనలను స్వల్పంగా సవరించింది దుబాయ్ సుప్రీం కమిటీ. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఏర్పాటైన సుప్రీం కమిటీ..ఇకపై రెస్టారెంట్లు, కేఫ్ లలో మరింత దూరం పెంచాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రెండు టేబుళ్ల మధ్య రెండు మీటర్లు ఉంటే సరిపోయేది. సుప్రీం కమిటీ తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం ప్రకారం ఇక నుంచి టేబుల్ కి టేబుల్ కి మధ్య మూడు మీటర్ల దూరాన్ని మేయిన్టేన్ చేయాలి. అలాగే ఒక్కో టేబుల్ మీద గరిష్టంగా అనుమతించే వినియోగదారుల సంఖ్యను కూడా కుదించారు. రెస్టారెంట్లలో అయితే ఒక్కో టేబుల్ పై గతంలో పది మందికి అనుమతి ఉండేది. కానీ, ఇప్పుడు ఏడుగురికి మించి అనుమతించరాదు. ఇక కేఫ్ లలో ఒక్కో టేబుల్ పై గరిష్టంగా నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. రెస్టారెంట్లు, కేఫ్ లలో వినియోగదారుల సంఖ్యను కుదించటం...తద్వారా భౌతిక దూరం నిబంధనను పకడ్బందీగా అమలు చేసేందుకు అనువుగా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు