డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- January 23, 2021రియాద్:సౌదీ బలగాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టుని రట్టు చేశారు. ఈ క్రమంలో 20 మిలియన్ యాంఫిటమిన్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రేప్ ఫ్రూట్ షిప్మెంట్లో ఈ డ్రగ్స్ని కనుగొన్నట్లు అధికారులు వివరించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ అధికార ప్రతినిథి కెప్టెన్ మొహమ్మద్ బిన్ ఖాలెద్ అల్ నాజిది మాట్లాడుతూ జెడ్డా ఇస్లామిక్ పోర్టు నుంచి స్మగ్లింగ్ యత్నం జరుగుతుండగా, అడ్డుకుని 20,190,500 పిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జనరల్ కస్టమ్స్ అథారిటీతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు సౌదీలు, ఆరుగురు రెసిడెంట్స్ వున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ