టీచర్లకు కూడా పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసిన యూఏఈ
- January 24, 2021
యూఏఈ:ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యాక్రమాన్ని ముమ్మరం చేస్తూనే మరోవైపు వైరస్ వ్యాప్తి నియంత్రణకు అవసరమైన చర్యలను మరింత విస్తృతం చేస్తోంది యూఏఈ ప్రభుత్వం. ఇందులో భాగంగా మినిస్ట్రి, ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఇప్పుడు టీచర్లను కూడా అదే జాబితాలోకి చేర్చింది. ఇక నుంచి టీచర్లకు కూడా ప్రతి 14 రోజులకు ఒక సారి ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ టీచర్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది. రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రం పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. పీసీఆర్ టెస్టు ఖర్చులను టీచర్లే భరించాల్సి ఉంటుంది. అయితే..వ్యాక్సిన్ తీసుకునేందుకు వైద్యపరంగా అర్హులు కాని వారికి మాత్రం మంత్రిత్వ శాఖ ఖర్చుతో పీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులను అలక్ష్యం చేస్తే వారికి వేతనాల్లో కోత విధించనున్నారు. మొదటి రెండు సార్లు లిఖత పూర్వకంగా హెచ్చరికలు చేసి..మూడో సారికి ఒక రోజు వేతనాన్ని కట్ చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అయినా..పీసీఆర్ టెస్ట్ చేయించుకోకుంటే నాలుగో సారికి మూడు రోజుల వేతనాన్ని, ఐదో సారికి ఐదు రోజుల వేతనాన్ని కట్ చేయనున్నట్లు హెచ్చరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







