అదృశ్యమైన విమానం కూలింది : నేపాల్
- February 24, 2016
నేపాల్ పర్వతాల్లో ఈ రోజు ఉదయం అదృశ్యమైన విమానం కూలిపోయింది. ఆ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 23మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల్లో ఇద్దరు విదేశీయులు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. విమానంలోని వారంతా మృతి చెందినట్లు తెలుస్తోంది. తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం నేపాల్లోని పొఖారా నుంచి ఉదయం 7.45 గంటలకు జామ్సోమ్కు బయలుదేరింది. టేకాఫ్ అయిన 8 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. అనంతరం పర్వత శ్రేణుల్లో విమానం కూలిపోయిందని, ప్రత్యక్ష సాక్షుల ద్వారా సమాచారం అందిందని జామ్సమ్ ప్రాంత పోలీసు చీఫ్ హరిహరి యోగి తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







