న్యూ ఢిల్లీ:ఎర్రకోటపై రైతన్న జెండా!

- January 26, 2021 , by Maagulf
న్యూ ఢిల్లీ:ఎర్రకోటపై రైతన్న జెండా!

న్యూ ఢిల్లీ: భారత దేశ రాజధాని ఢిల్లీ రణరంగాన్ని తలపిస్తోంది. పోలీసుల అనుమతితో ట్రాక్టర్ల ర్యాలీని చేపట్టిన రైతులు కొందరు రూట్ మ్యాప్ మార్చేశారు. సెంట్రల్ ఢిల్లీలోకి చొచ్చుకుపోయారు. ఎర్రకోట ప్రాంగ‌ణానికి కూడా భారీ సంఖ్యలో చేరి ఆందోళన చేపట్టారు. ఎర్రకోట ముందు ఉన్న ఓ స్తంభంపై తమ జెండాలను ఎగురవేశారు. అనంతరం నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎర్రకోట పై తొలిసారి జాతీయ జెండా కాకుండా మరో జెండా ఎగరడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా, వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com