భారత్ ఆర్థికాభివృద్ధిలో 'కస్టమ్స్' కీలకపాత్ర: టి.గవర్నర్ తమిళిసై
- January 27, 2021
హైదరాబాద్:భారత దేశ ఆర్థికాభివృద్ధిలో కస్టమ్స్ విభాగం కీలకపాత్ర పోషిస్తోందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.హైదరాబాద్ కస్టమ్స్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కస్టమ్స్ డే-2021 వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. 
కొవిడ్-19 లాక్డౌన్ సంక్షోభ సమయంలో కస్టమ్స్ విభాగం అద్భుత సేవలందించిందన్నారు. సమర్థవంతమైన సరఫరా చైన్ సిస్టం ద్వారా కస్టమ్స్ విభాగం ముఖ్యపాత్ర పోషిందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా గవర్నర్ అవార్డులను, ప్రత్యేక ప్రశంస ధృవీకరణ పత్రాలను విజేతలకు అందజేసి వారి సేవలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో
డాక్టర్ పి.సౌందరరాజన్(ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్),మల్లికా ఆర్య(చీఫ్ కమిషనర్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్),జెఎస్ చంద్రశేకర్(ప్రిన్సిపల్ కమిషనర్), జెబి మోహపాత్రా(ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్-IT), డి. పురుషోత్తం(ప్రిన్సిపల్ కమిషనర్-GST తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







