భారత్ ఆర్థికాభివృద్ధిలో 'కస్టమ్స్' కీలకపాత్ర: టి.గవర్నర్ తమిళిసై
- January 27, 2021హైదరాబాద్:భారత దేశ ఆర్థికాభివృద్ధిలో కస్టమ్స్ విభాగం కీలకపాత్ర పోషిస్తోందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.హైదరాబాద్ కస్టమ్స్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కస్టమ్స్ డే-2021 వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు.
కొవిడ్-19 లాక్డౌన్ సంక్షోభ సమయంలో కస్టమ్స్ విభాగం అద్భుత సేవలందించిందన్నారు. సమర్థవంతమైన సరఫరా చైన్ సిస్టం ద్వారా కస్టమ్స్ విభాగం ముఖ్యపాత్ర పోషిందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా గవర్నర్ అవార్డులను, ప్రత్యేక ప్రశంస ధృవీకరణ పత్రాలను విజేతలకు అందజేసి వారి సేవలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో
డాక్టర్ పి.సౌందరరాజన్(ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్),మల్లికా ఆర్య(చీఫ్ కమిషనర్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్),జెఎస్ చంద్రశేకర్(ప్రిన్సిపల్ కమిషనర్), జెబి మోహపాత్రా(ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్-IT), డి. పురుషోత్తం(ప్రిన్సిపల్ కమిషనర్-GST తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్