మహిళ పోలీస్ సిబ్బందికి కేసుల దర్యాప్తులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం: సీపీ సజ్జనార్
- January 27, 2021
హైదరాబాద్:"షీ పాహి", ఫస్ట్ అన్యువల్ కాన్ఫరెన్స్ 2021 ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీస్ అధికారులతో పాటు ముఖ్య అతిథిగా టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క శెట్టి హాజరయ్యారు. కాగా, సైబరాబాద్ లో డయల్ 100 క్విక్ రెస్పాన్స్ వాహనాలను సినీ నటి అనుష్క ప్రారంభించారు.ఫ్రీ షీ షటిల్ బస్ లను అనుష్కతో పాటుగా, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, సైబరాబాద్ సీపీ సజ్జానార్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం వివిధ పోలీస్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు ప్రశంస అవార్డులతో సత్కరించారు.

తెలంగాణ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. సైబరాబాద్ లో 750 ఉమెన్ పోలీసులు ఉన్నారు. ఒక యానువాల్ మీట్ లాగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. "షీ పాహి" కార్యక్రమం ఏర్పాటు ద్వారా మహిళ సిబ్బందిలో స్ఫూర్తి నింపుతాం. తెలంగాణ ప్రభుత్వం 33 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది. సీనియర్ ఆఫీసర్స్ లో 50 శాతం మహిళలు ఉన్నారు. మహిళ సిబ్బందికి కేసు ల దర్యాప్తు లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. సైబరాబాద్ లో మహిళా సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారు. ఉమెన్ సిబ్బంది కి ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో డ్రైవింగ్ పై శిక్షణ ఇస్తాం. ట్రాఫిక్ లో సైతం మహిళ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మనల్ని సృష్టించింది తల్లి... నా తల్లికి వల్లనే నేను ఇక్కడ ఉన్నాను.షి టీమ్స్ ఒక మహా యజ్ఞం.. మహిళల భద్రత కోసం TCOPS నిరంతర కృషి చేస్తున్నాయి.తెలంగాణ షి టీమ్స్ దేశానికే ఆదర్శం.. మెన్ ఆఫీసర్స్ కు ధీటుగా 60 కేసులను.. షీ టీమ్స్ పరిస్కరించాయి.. షీ టీమ్స్ వెహికిల్స్ ను నేడు మహిళ పోలీసులే నడుపుతున్నారు.. విమెన్ క్యాబ్.. లను షి టీమ్స్ పోత్సహిస్తున్నాయి. బాల మిత్ర ద్వారా 6 వేల టీచర్ లను ట్రైన్ చేసి.. వాళ్ళ ద్వారా పిల్లల సమస్యలను పరిస్కరిస్తున్నాం. మహిళల రవాణా కోసం సేఫ్టీ కోసం ఈ బస్ లు పనిచేస్తున్నాయి. మీ శక్తిని ఉపయోగించి సమ సమాజాన్ని నిర్మించాలి.. నేర రహిత భారతాన్ని మీరంతా నిర్మించాలి అని సీపీ సజ్జనార్ తెలిపారు





తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







