భారత్ ఆర్థికాభివృద్ధిలో 'కస్టమ్స్' కీలకపాత్ర: టి.గవర్నర్ తమిళిసై
- January 27, 2021హైదరాబాద్:భారత దేశ ఆర్థికాభివృద్ధిలో కస్టమ్స్ విభాగం కీలకపాత్ర పోషిస్తోందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.హైదరాబాద్ కస్టమ్స్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కస్టమ్స్ డే-2021 వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు.
కొవిడ్-19 లాక్డౌన్ సంక్షోభ సమయంలో కస్టమ్స్ విభాగం అద్భుత సేవలందించిందన్నారు. సమర్థవంతమైన సరఫరా చైన్ సిస్టం ద్వారా కస్టమ్స్ విభాగం ముఖ్యపాత్ర పోషిందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా గవర్నర్ అవార్డులను, ప్రత్యేక ప్రశంస ధృవీకరణ పత్రాలను విజేతలకు అందజేసి వారి సేవలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో
డాక్టర్ పి.సౌందరరాజన్(ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్),మల్లికా ఆర్య(చీఫ్ కమిషనర్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్),జెఎస్ చంద్రశేకర్(ప్రిన్సిపల్ కమిషనర్), జెబి మోహపాత్రా(ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్-IT), డి. పురుషోత్తం(ప్రిన్సిపల్ కమిషనర్-GST తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు