షిషా కేఫ్‌ల సస్పెన్షన్: ఔట్‌డోర్ సర్వీసులు 30 మందికే పరిమితం

- January 28, 2021 , by Maagulf
షిషా కేఫ్‌ల సస్పెన్షన్: ఔట్‌డోర్ సర్వీసులు 30 మందికే పరిమితం

మనామా:రెస్టారెంట్లలో డైన్-ఇన్ సర్వీసులు, కేఫ్‌లు, షిషా కేఫ్‌లు జనవరి 31 నుంచి 3 వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, కామర్స్ మరియు టూరిజం వెల్లడించింది. అలాగే, ఔట్ డోర్ సర్వీసులకు సంబంధించి రిజర్వేషన్ కేవలం 30 మందికి మాత్రమే పరిమితం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో టేబుల్‌కి 6 మందికి మించకుండా రెస్టారెంట్లలో ఏర్పాట్లు వుండాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో నిబంధనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని మినిస్ట్రీ సూచిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com