గంగూలీ క్షేమం
- January 28, 2021
కలకత్తా: బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు గురువారం సాయంత్రం తెలిపారు. ఈరోజు పరీక్షలు కూడా నిర్వహించామని, ఫలితాలు వచ్చాక తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకుంటామని ఆస్పత్రి సీనియర్ వైద్యులు వెల్లడించారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో బుధవారం ఆయన రెండోసారి ఆస్పత్రిలో చేరిన విషయం విధితమే. యాంజియోగ్రాఫీ చేసే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి మరో స్టెంట్ను వేస్తారని కూడా సమాచారం.
జనవరి తొలివారంలో ఆయనకు గుండెనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. అప్పుడు గుండె రక్తనాళాల్లో మూడుచోట్ల పూడికలుడడంతో సమస్య కనిపించిన చోట వైద్యులు స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం బాగానే ఉండడంతో మిగిలిన చోట్ల స్టెంట్ వేయడాన్ని వాయిదా వేశారు. అయితే.. బుధవారం కాస్త తేడాగా అనిపించడంతో రెండోసారి ఆస్పత్రికి వచ్చారు. గురువారం ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు మాట్లాడుతూ.. దాదా రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారని, ఉదయం లేవగానే తేలికపాటి అల్పాహారం తీసుకున్నారన్నారు. వెస్ట్బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే గంగూలీ ఆరోగ్యం పట్ల ఆరా తీశారని, సిపిఎం సీనియర్ నాయకులు అశోక్ భట్టాచార్య ఆస్పత్రికి వచ్చి పరామర్శించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







