అడవి శేష్ 'మేజర్' విడుదల తేదీ ఖరారు
- January 29, 2021
హైదరాబాద్:తెలుగు చిత్ర సీమలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో అడవి శేష్ కూడా ఒకడనడంలో సందేహం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరిస్తుంటాడు. అలాంటి అడవి శేష్ ప్రస్తుతం "మేజర్" సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి ‘గూఢచారి’ ఫేం శశి కిరణ టిక్కా దర్శకత్వం వహిస్తుండగా, సూపర్స్టార్ మహేష్ బాబు ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శోభితా ధూళిపాళ్ల ఈ సినిమాలో కథానాయిక. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రాగా.. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా వదిలింది చిత్ర బృందం. ఈ మూవీని 2021, జూలై 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆదరిస్తోందో చూడాలి. కాగా.. క్షణం, గూఢచారి, ఎవరు వంటి సూపర్హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









