భార్యపై దాడి: భర్తకు 30,000 దిర్హాముల జరీమానా

- January 30, 2021 , by Maagulf
భార్యపై దాడి: భర్తకు 30,000 దిర్హాముల జరీమానా

అబుధాబి:తన భార్యను కొట్టినందుకు ఓ భర్త నష్ట పరిహారం కింద 30,000 దిర్హాములు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. బాధిత మహిళ, తనను తన భర్త తీవ్రంగా కొట్టినట్లు ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచరాణలో, నిందితుడు తన భార్యను పలుమార్లు అవమానించడమే కాకుండా, దారుణంగా కొట్టినట్లు తేలింది. తనకు జరిగిన అవమానం, తగిలిన గాయాలకుగాను 40,000 నష్టపరిహారం చెల్లించాలని ఆమె న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. అబుధాబి కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ బాధితురాలికి 20,000 దిర్హాములు నష్ట పరిహారం కొంద చెల్లించాలని నిందితుడ్ని ఆదేశించడం జరిగింది. 

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com