వ్యాక్సిన్ పొందండి, బహ్రెయిన్‌కి అండగా నిలవండి:భారత రాయబారి

- January 30, 2021 , by Maagulf
వ్యాక్సిన్ పొందండి, బహ్రెయిన్‌కి అండగా నిలవండి:భారత రాయబారి

మనామా:భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ, భారత కమ్యూనిటీ మెంబర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా కరోనాపై బహ్రెయిన్ చేస్తోన్న పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని ఆయన సూచించారు. బహ్రెయిన్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న వ్యాక్సినేషన్ డ్రైవ్ పట్ల హర్షం వ్యక్తం చేశారు భారత రాయబారి. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లో వర్చువల్ విధానం ద్వారా పాల్గన్న కమ్యూనిటీ మెంబర్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలనీ, ట్రావెల్ సంబంధిత సమాచారం అలాగే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com