అహింసా ఉధ్యమం ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం ఏ.పీ గవర్నర్
- January 30, 2021
విజయవాడ:మహాత్మా గాంధీ నేతృత్వంలోని అహింసా ఉద్యమం ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కేవలం అహింస మాత్రమే దేశానికి స్వేచ్ఛా వాయివులు ప్రసాదించగలదని మహాత్మా గాంధీ విశ్వసించే వారని గవర్నర్ అన్నారు. దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్న శుభతరుణంలో మహాత్మాగాంధీ 73వ వర్ధంతిని పురస్కరించుకుని గవర్నర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ హరిచందన్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశ స్వేచ్ఛ కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన వారందరి జ్ఞాపకార్థం, మహాత్ముడికి గౌరవార్ధం గవర్నర్ హరిచందన్,రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల మౌనం పాటించారు.
ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ ఎందరో మహనీయిల త్యాగఫలితంగా భారతావని ఇప్పడు స్వతంత్ర దేశంగా ఫరిడవిల్లుతుందని, ఇటు సైనికపరంగా, అటు ఆర్థికంగా ప్రపంచంలోనే ముఖ్య శక్తిగా అవతరించిందన్నారు. మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపుకు స్పందించిన దేశ ప్రజలు నాటి శక్తివంతమైన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేసారు. భారతదేశం వదిలి పోవాలని గాంధీజీ బ్రిటిష్ వారిని కోరినప్పుడు శాంతియుత మార్గాలలో బ్రిటిష్ పాలకులను దేశం నుండి తరిమికొట్టవచ్చని నమ్మలేదని గవర్నర్ అన్నారు. అనేక దేశాల నాయకులు మహాత్మా గాంధీని అనుకరించి, వారి స్వేచ్ఛా ఉద్యమాలలో అహింస, సత్యాగ్రహ సూత్రాలను పాటించటం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. శాంతి, అహింసలకు గొప్ప చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతున్న జాతిపిత మహాత్మా గాంధీని దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని గవర్నర్ వివరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఇతర అధికారులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..