తీవ్రవాద చర్య: 18 మందికి జైలు
- February 01, 2021
మనామా:బహ్రెయిన్లోని పలు కీలక ప్రాంతాల్లో బాంబులు పేల్చేందుకు ఓ తీవ్రవాద సంస్థతో చేతులు కలిపిన 18 మంది వ్యక్ుతలకు 5 ఏళ్ళ నుంచి జీవిత ఖైదు వరకు జైలు శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. 8 మంది నిందితులకు న్యాయస్థానం జీవిత ఖైదు విదించింది. ఇద్దరికి 15 ఏళ్ళ జైలు శిక్ష ఖరారైంది. మరో ఇద్దరికి పదేళ్లు, ఐదుగురికి ఐదేళ్ళ జైలు శిక్ష, ఒకరికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. కాగా, తొమ్మిదిమంది నిందితులు దేశం విడిచి పారిపోయారు. నిందితులంతా 17 నుంచి 37 ఏళ్ళ వయసు లోపు వారే. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ మద్దతుదారులుగా నిందితులపై ఆరోపణలు నిరూపించబడ్డాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







