పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును సత్కరించిన టి.గవర్నర్

- February 01, 2021 , by Maagulf
పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును సత్కరించిన టి.గవర్నర్

హైదరాబాద్:కనకరాజుకు పద్మశ్రీ అవార్డు రావడం తెలంగాణకు గర్వకారణమని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్‌లో ఆమె మాట్లాడుతూ.. ఇది దేశంలోనే నాల్గవ పెద్ద అవార్డు అని పేర్కొన్నారు. గుస్సాడి నృత్యం వ్యవసాయానికి సంబంధించినది కాదన్నారు. కనకరాజుకి తెలంగాణ ప్రభుత్వం 10వేల రూపాయల పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇల్లు ప్రకటించడం సంతోషమన్నారు. గిరిజనులు అమాయకులు, సంప్రదాయాలను గౌరవిస్తారన్నారు. బోయినపల్లి మోడల్ మార్కెట్ నిర్వాహకులకు తన అభినందనలు తెలిపారు. నిన్న మన్ కి బాత్‌లో ప్రధాని మోడల్ మార్కెట్‌ను కొనియాడారన్నారు. ఇక్కడ వెజ్‌టేబుల గార్బేజ్ ద్వారా విద్యుత్‌ను తయారు చేస్తున్నారని తమిళిసై పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com