భారత్ తో ఎయిర్ బబుల్ ఒప్పందం పొడిగింపు
- February 02, 2021
మస్కట్: అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే..పలు దేశాలతో కుద్చుర్చుకున్న ఎయిర్ బబుల్ ఒప్పందం మేరకు ఇప్పటికే షెడ్యూల్ అయిన విమాన సర్వీసులను మాత్రం కొనసాగించనున్నట్లు వెల్లడించింది. అలాగే వందేభారత్ మిషన్ ఫ్లైట్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే ఒమన్-భారత్ మధ్య వందేభారత్ మిషన్, ఎయిర్ బబుల్ ఒప్పందం మేరకు పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయి. ఒప్పందం ప్రకారం భారత్-ఒమన్ మధ్య ఒమన్ ఎయిర్, సలాం ఎయిర్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ వంటి నేషనల్ క్యారియర్లు మాత్రమే సర్వీసులు ఆపరేట్ చేసేందుకు అనుమతి ఉంది. ఇక కరోనా వ్యాప్తి నియంత్రణకు పాటించాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు యథావిధిగా కొనసాగుతాయని, ఒమన్ కు చేరుకునే ప్రతి ప్రయాణికుడు తమ ప్రయాణానికి 72 గంటల లోపు చేయించుకున్న పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే ఫ్లైట్ ఎక్కేందుకు పర్మిషన్ ఇస్తారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







