భారత్ తో ఎయిర్ బబుల్ ఒప్పందం పొడిగింపు
- February 02, 2021
మస్కట్: అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే..పలు దేశాలతో కుద్చుర్చుకున్న ఎయిర్ బబుల్ ఒప్పందం మేరకు ఇప్పటికే షెడ్యూల్ అయిన విమాన సర్వీసులను మాత్రం కొనసాగించనున్నట్లు వెల్లడించింది. అలాగే వందేభారత్ మిషన్ ఫ్లైట్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే ఒమన్-భారత్ మధ్య వందేభారత్ మిషన్, ఎయిర్ బబుల్ ఒప్పందం మేరకు పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయి. ఒప్పందం ప్రకారం భారత్-ఒమన్ మధ్య ఒమన్ ఎయిర్, సలాం ఎయిర్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ వంటి నేషనల్ క్యారియర్లు మాత్రమే సర్వీసులు ఆపరేట్ చేసేందుకు అనుమతి ఉంది. ఇక కరోనా వ్యాప్తి నియంత్రణకు పాటించాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు యథావిధిగా కొనసాగుతాయని, ఒమన్ కు చేరుకునే ప్రతి ప్రయాణికుడు తమ ప్రయాణానికి 72 గంటల లోపు చేయించుకున్న పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే ఫ్లైట్ ఎక్కేందుకు పర్మిషన్ ఇస్తారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







