మయన్మార్కు బైడెన్ వార్నింగ్
- February 02, 2021
వాషింగ్టన్: మయన్మార్లో ప్రభుత్వాన్ని సైన్యం ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశంపై ఆంక్షలను విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. వాస్తవానికి ఇటీవల మయన్మార్పై ఆంక్షలను ఎత్తివేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీ పార్టీ భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సూకీతో పాటు ఇతరులను గృహనిర్బంధం చేసింది. ఐక్యరాజ్యసమితి, బ్రిటన్, ఈయూ కూడా ఈ చర్యను ఖండించాయి.
1989 నుంచి 2010 వరకు సుమారు 15 ఏళ్ల పాటు నిర్బంధంలో ఉన్న సూకీ.. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని ఓ లేఖలో సూకీ కోరారు. సైనిక చర్యలు మళ్లీ దేశాన్ని నియంతృత్వంలోకి తీసుకువెళ్తున్నట్లు ఆమె అన్నారు. మయన్మార్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన బైడెన్.. ప్రజల మనోభావాలను సైనిక శక్తితో నొక్కిపెట్టరాదు అని, విశ్వసనీయ ఎన్నికల ఫలితాలను తోసిపుచ్చరాదని అన్నారు. మయన్మార్పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం వల్లే ఆ దేశంలో మళ్లీ ప్రజాస్వామ్యం వెల్లివిరిసిందని, ఈ అంశాలను మరోసారి పరిశీలిస్తామని, ఎక్కడ ప్రజాస్వామ్యంపై దాడి జరిగితే, అక్కడ ఆ దేశానికి అమెరికా మద్దతుగా ఉంటుందని అన్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







