మయన్మార్కు బైడెన్ వార్నింగ్
- February 02, 2021
వాషింగ్టన్: మయన్మార్లో ప్రభుత్వాన్ని సైన్యం ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశంపై ఆంక్షలను విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. వాస్తవానికి ఇటీవల మయన్మార్పై ఆంక్షలను ఎత్తివేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీ పార్టీ భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సూకీతో పాటు ఇతరులను గృహనిర్బంధం చేసింది. ఐక్యరాజ్యసమితి, బ్రిటన్, ఈయూ కూడా ఈ చర్యను ఖండించాయి.
1989 నుంచి 2010 వరకు సుమారు 15 ఏళ్ల పాటు నిర్బంధంలో ఉన్న సూకీ.. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని ఓ లేఖలో సూకీ కోరారు. సైనిక చర్యలు మళ్లీ దేశాన్ని నియంతృత్వంలోకి తీసుకువెళ్తున్నట్లు ఆమె అన్నారు. మయన్మార్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన బైడెన్.. ప్రజల మనోభావాలను సైనిక శక్తితో నొక్కిపెట్టరాదు అని, విశ్వసనీయ ఎన్నికల ఫలితాలను తోసిపుచ్చరాదని అన్నారు. మయన్మార్పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం వల్లే ఆ దేశంలో మళ్లీ ప్రజాస్వామ్యం వెల్లివిరిసిందని, ఈ అంశాలను మరోసారి పరిశీలిస్తామని, ఎక్కడ ప్రజాస్వామ్యంపై దాడి జరిగితే, అక్కడ ఆ దేశానికి అమెరికా మద్దతుగా ఉంటుందని అన్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







